న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు కదంతొక్కారు. 40 రైతు సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపునిచ్చిన భారత్ బంద్లో భాగంగా సోమవారం రైల్రోకో, రాస్తారోకోలు నిర్వహించారు. పలు రైళ్లు రద్దయ్యాయి. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలను రైతులు దిగ్బంధించడంతో రాకపోకలు స్తంభించాయి. వేలాది మంది ప్రజ లు మార్గమధ్యంలో చిక్కుకుని ఇబ్బందు లు పడ్డారు. ఢిల్లీ చుట్టుపక్కల, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్తో పాటు కేరళ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 వరకు బంద్ కొనసాగింది. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సాగు చట్టాలకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపి సోమవారానికి ఏడాది. ఆ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు నిరసనలు చేపట్టి 10 నెలలు అయింది. ఢిల్లీకి వచ్చే రహదారులను రైతులు దిగ్బంధించారు. పంజాబ్లో బంద్ పూర్తిస్థాయిలో జరిగింది. హర్యానాలో హైవేలపై రైతులు బైఠాయించారు. ఢిల్లీ సరి హద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిం ది. భారత్ బంద్కు 23 రాష్ర్టాల్లో అనూ హ్య స్పందన లభించిందని ఎస్కే ఎం తెలిపింది. ఎక్కడా ఒక్క అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసుకోలేదని, బంద్ ప్రశాంతంగా జరిగిందని పేర్కొంది.