(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఒక వస్తువు కొనాలని ఉంటుంది. అయితే, సమయానికి చేతిలో డబ్బు ఉండదు. పోనీ క్రెడిట్ కార్డు ద్వారా ఇద్దామంటే అదీ ఉండదు. బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలంటే పెద్ద మొత్తమేమీ కాదు. ఇలాంటి వారి కోసమే గత కొంతకాలంగా ‘బై నౌ పే లేటర్ – ఇప్పుడు కొనండి..తర్వాత చెల్లించండి (బీఎన్పీఎల్)’ ఎంపికను పలు యాప్స్, ఫైనాన్స్ సంస్థలు, ఈ కామర్స్ సైట్లతో పాటు కొన్ని బ్యాంకులు కూడా అందుబాటులోకి తెచ్చాయి. అయితే, బీఎన్పీఎల్తో కనబడని అప్పు అంతకంతకూ పేరుకుపోతుందని, ఆలస్య రుసుములతో సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నట్టు ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా వస్తువు కొనుగోలు చేసేప్పుడు ఆ బిల్లును వెంటనే చెల్లించకుండా.. కొన్నాళ్ల తర్వాత ఏక మొత్తంలో లేదా వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటును కల్పించేదే బీఎన్పీఎల్. దీని ద్వారా కనిష్ఠంగా రూ.100 నుంచి రూ. లక్ష వరకూ సమకూర్చుకోవచ్చు. బిల్లు చెల్లించేందుకు
14 రోజుల నుంచి 90 రోజుల వరకూ గడువు ఉంటుంది.

మన దేశంలో ప్రతి 14 మందిలో బీఎన్పీఎల్ వినియోగిస్తున్నవారు : 1
సగటున ఒక్కొక్కరు వాడుతున్న బీఎన్పీఎల్ ఖాతాలు : 2-4
రూ1500 బీఎన్పీఎల్లో రూ.5 వేలు అప్పుచేసి రెండు నెలలు చెల్లించకపోతే కట్టాల్సిన గరిష్ఠ జరిమానా
మూడు నెలల ఆలస్యం జరిగితే,సగటున కట్టాల్సిన పెనాల్టీ-తీసుకొన్న అప్పుకు 40% అదనం