Fraud Calls | న్యూఢిల్లీ, మార్చి 29: కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ(డీవోటీ) పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. మొబైల్ నంబర్లు(కనెక్షన్లు) తొలగిస్తామని, మీ నంబర్ కొన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో దుర్వినియోగం అయిందని తమ శాఖ అధికారుల నుంచి వచ్చినట్టు చెప్పే బెదిరింపు కాల్స్ను నమ్మవద్దని సూచించింది.
విదేశీ మొబైల్ నెంబర్లతో(+92తో మొదలయ్యే లాంటివి) వాట్సాప్ కాల్స్ చేసి ప్రభుత్వ అధికారుల పేర్లతో ఎవరైనా బెదిరించినా నమ్మొద్దని చెప్పింది. తమ శాఖ తరపున ఎవరూ అలాంటి ఫోన్ కాల్స్ చేయరని స్పష్టం చేసింది.