New Scam Alert | న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఈ-చలాన్ పేరుతో మన బ్యాంక్ అకౌంట్లకు కన్నం వేస్తున్నారు. అధికారిక ఈ-చలాన్ వెబ్సైట్ను పోలి ఉండేలా నకిలీ వెబ్సైట్ను తయారుచేశారు. ‘మీ వాహనానికి రూ.500 ట్రాఫిక్ చలాన్ పడింది. ఆన్లైన్ పేమెంట్ చేసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి’ అంటూ జనానికి నకిలీ లింక్తో కూడిన ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు.
ఈ లింక్ ఓపెన్ చేస్తే బ్యాంక్ అకౌంట్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ చలాన్కు సంబంధించి https://echallan.parivahan.gov.in అసలైన లింక్ అని, సైబర్ నేరగాళ్లు https:// echallanparivahan.in అనే నకిలీ లింక్ను పంపిస్తున్నారని పేర్కొన్నది. ఇలాంటి నకిలీ లింక్లను క్లిక్ చేయవద్దని సూచించింది.