24 గంటల్లో 47,262 కొత్త కేసులు
న్యూఢిల్లీ: కరోనా రెండోవేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో.. రాబోయే హోలీ, ఈస్టర్, ఈద్-ఉల్-ఫితర్ లాంటి పండుగల సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. పండుగల సమయంలో ప్రజలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని కోరింది. మరోవైపు, మంగళవారం నుంచి బుధవారానికి 24 గంటల వ్యవధిలో 47,262 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 77.44% కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, గుజరాత్లోనే వెలుగుచూశాయి.