WTO on Omicron | తాజాగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ అనే కొత్త కరోనా వేరియంట్ వెలుగు చూడటంతో పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ నెల 30న జెనీవాలో జరుగాల్సిన సభ్యదేశాల మంత్రుల స్థాయి సమావేశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరవధికంగా వాయిదా వేసింది. ఇప్పటికే స్విట్జర్లాండ్తోపాటు పలు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చింది. కొన్ని దేశాలు లాక్డౌన్ కూడా ప్రకటించాయి.
ఈ పరిస్థితుల్లో శుక్రవారం అత్యవసరంగా భేటీ అయిన డబ్ల్యూటీవో అధికారులు.. సంస్థ 12వ స్థాయి మంత్రుల సమావేశం వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రస్తుత అస్థిర పరిస్థితుల్లో మార్గాంతరం లేదని డబ్ల్యూటీవో వివరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గతేడాది జూన్లో డబ్ల్యూటీవో సభ్య దేశాల మంత్రుల స్థాయి సమావేశం జరుగాల్సి ఉంది.