న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ప్రపంచ ప్రసిద్ధ కార్ల బ్రాండు బెర్టోన్.. ప్లాస్టిక్ వ్యర్థాలతో నడిచే సరికొత్త మాడల్ను ఆవిష్కరించింది. బ్రాండ్ ఆవిర్భవించి 110 ఏండ్లు అయిన సందర్భంగా బెర్టోన్ జీబీ 110 అనే పేరుతో ఈ మాడల్ వినియోగదారుల ముందుకు రాబోతున్నది.
ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారుచేసిన ఇంధనంతో నడువడం ఈ కారు ప్రత్యేకత. ఈ ఇంధనానికి సెలక్ట్ ఫ్యూయల్ అని పేరు పెట్టారు. దీనిపై పేటెంటు కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. కొత్తరకం కార్లు కేవలం 33 మాత్రమే తయారు చేస్తారట. డెలివరీ 2024లో మాత్రమే సాధ్యమని కంపెనీ తెలిపింది.