Rameshwaram Cafe | న్యూఢిల్లీ, మార్చి 28: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తులో కీలకమైన ముందడుగు పడింది. ఈ నేరంలో ముఖ్య నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. కర్ణాటకలో 12 చోట్ల, తమిళనాడులో 5 చోట్ల, ఉత్తరప్రదేశ్లో ఒక చోట ఎన్ఐఏ బృందాలు దాడులు నిర్వహించాయని, ఈ నేపథ్యంలో పేలుడు కుట్రదారుల్లో ఒకడైన ముజామ్మిల్ షరీఫ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఎన్ఐఏ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పేలుళ్లకు పాల్పడిన వ్యక్తిగా ముసావీర్ షాజీబ్ హుస్సేన్ను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అబ్దుల్ మాథీన్ తహాను మరో కుట్రదారుడుగా ఎన్ఐఏ పేర్కొన్నది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిద్దరూ, ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కనిపెట్టేందుకు ఎన్ఐఏ బృందాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నాయి.