బెంగళూరు, ఫిబ్రవరి 6: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులో మెట్రో రైలు చార్జీలు మరోసారి పెరిగాయి. అన్ని రకాల టికెట్ క్యాటగిరీలపై 5 శాతం చార్జీలు పెంచుతూ బీఎంఆర్సీఎల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చార్జీల పెరుగుదల ఈ నెల 9 నుంచి అమలులోకి వస్తుంది. ఈ చార్జీల భారం విద్యార్థులు, రోజువారీ ప్రయాణం చేసే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులపై అధికంగా పడనుంది.
ప్రతి టికెట్పై కనీసం రూ.1 నుంచి గరిష్ఠంగా రూ.5 వరకు చార్జీ పెరుగుతుంది. గత ఏడాది 71 శాతం వరకు చార్జీలు పెంచడం ద్వారా బెంగళూరు మెట్రో దేశంలోనే అతి ఖరీదైన మెట్రో వ్యవస్థగా మారింది.