బెంగళూర్ : ఐటీ సంస్ధల అడ్డాగా మారిన బెంగళూర్ త్వరలో ట్రాఫిక్ జామ్ల సిటీగా ((Viral Video)) పేరొందడం ఖాయమని చెబుతున్నారు. బెంగళూర్లో కార్యాలయాలకు సకాలంలో చేరాలంటే రెండు, మూడు గంటలు ముందుగా బయలుదేరాల్సిన పరిస్ధితి నెలకొంది. ట్రాఫిక్ కష్టాలను ఏకరువు పెడుతూ పలువురు ప్రయాణీకులు సోషల్ మీడియాలో వీడియోలు పెడుతుండగా తాజాగా సాయిచంద్ బయ్యవరపు బెంగళూర్ ట్రాఫిక్ కష్టాలపై ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
ఈ వీడియోలో ట్రాఫిక్ జాంలో చిక్కుకుపోయిన బస్ డ్రైవర్ తన సీటులో కూర్చుని లంచ్ చేస్తుండటం కనిపిస్తుంది. బెంగళూర్లో ట్రాఫిక్ కష్టాలు అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద ఈ ఘటనను రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఈ పోస్ట్ను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా 14 లక్షల వ్యూస్ లభించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు.
బస్ డ్రైవర్ పట్ల పలువురు సానుభూతి వ్యక్తం చేయగా బెంగళూర్లో ట్రాఫిక్ కష్టాలు భరించలేనివని కామెంట్ చేశారు. అడుగడుగునా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనా అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని దుయ్యబట్టారు. ఇది చాలా విచారకరం ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా డ్రైవర్ ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు కూడా సమయం లేదని ఓ ఇన్స్టాగ్రాం యూజర్ రాసుకొచ్చారు. ఆఫీసుకు వెళుతూనే తాను బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చిందని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More
Samanatha | సిద్దూ జొన్నలగడ్డకు జోడీగా సమంత.. నందిని రెడ్డి మాస్టర్ ప్లాన్