Rameshwaram Cafe | బెంగళూరు: బెంగళూరు రామేశ్వరం కేఫ్లో శుక్రవారం జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దగ్గరలోని బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజ్లను జల్లెడ పట్టారు.
అలాగే ఆ ప్రాంతంలోని మొబైల్ టవర్ సిగ్నళ్లను కూడా విశ్లేషిస్తున్నారు. టోపీ, మాస్క్ ధరించిన ఒక వ్యక్తిని వారు అనుమాస్తున్నారు. అతడే ఈ పేలుడుకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. సీఎం సిద్ధ రామయ్య శనివారం అధికారులతో సమావేశం అనంతరం రామేశ్వరం కేఫ్ను పరిశీలించారు.