కోల్కతా, మే 5: నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి జయంతి నేపథ్యంలో మే 9న కోల్కతాలో తమ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో ప్రకటించింది. కాగా, పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బారక్పూర్లో తన చివరి ర్యాలీ సందర్భంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజున బీజేపీ ఆధ్వర్యంలో కొత్త బెంగాల్ ఆవిర్భవించబోతుందని చెప్పారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను కూడా హాజరవుతాననే నమ్మకంతో వెళ్తున్నానని తెలిపారు.