కోల్కతా : ప్రముఖ బెంగాలీ రచయిత్రి, జానపద సంస్కృతిక పరిశోధకురాలు రత్న రషీద్ పశ్చిమ బెంగాల్ అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్యానికి చేసిన కృషికి బంగ్లా అకాడమీ సీఎం మమతా బెనర్జీకి ప్రత్యేకంగా అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించింది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి సాహిత్య పురస్కారం ప్రకటించడంపై నిరసన వ్యక్తం చేస్తూ రత్న రషీద్ను అవార్డును వెనక్కి తిరిగి ఇచ్చేయనున్నట్లు వెల్లడించారు. రత్న రషీద్ బెనర్జీని 2019లో పశ్చిమ బెంగాల్ అకాడమీ ‘అన్నదా శంకర స్మారక్ సమ్మాన్’ అవార్డుతో సత్కరించింది.
ఈ మేరకు అకాడమీ చైర్మన్, బెంగాల్ విద్యాశాఖ మంత్రి అయిన బ్రత్యబసుకు లేఖలో ఆమె నిరసన వ్యక్తం చేశారు. సీఎం మమతా బెనర్జీకి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అవార్డు తనకు ‘ముళ్ల కిరీటం’గా మారిందన్నారు. ఒక రచయితగా సీఎంకు సాహిత్య పురస్కారాన్ని అవమానించినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. గత సోమవారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 900పైగా కవితలతో కూడిన ‘కబితా బితాన్’ అనే సీఎం పుస్తకానికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన అవార్డును అకాడమీ ప్రకటించింది.