కోల్కతా: పద్మశ్రీ అవార్డు ప్రకటనకు కేంద్రం చేసిన ఆఫర్ను తిరస్కరించినట్టు ప్రముఖ తబలా విద్వాంసుడు అనింద్యా చటర్జీ పేర్కొన్నారు. ఆ పురస్కారం అందుకొనే దశను తానెప్పుడో దాటిపోయానని, అందుకే అవార్డును సున్నితంగా తిరస్కరించినట్టు వెల్లడించారు. ఇదే కారణాన్ని చూపుతూ ప్రముఖ గాయని సంధ్యా ముఖోపాధ్యాయ కూడా పద్మశ్రీని తిరస్కరించడం తెలిసిందే. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కూడా కేంద్రం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బెంగాల్కు చెందిన ముగ్గురు ప్రముఖులు పద్మ అవార్డులను తిరస్కరించినట్లయింది.