న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్కు (Ananda Bose) కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆనంద బోస్పై దాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు ఆయనకు భద్రత కల్పించనున్నారు.
కేరళ క్యాడర్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆనంద బోస్ గతేడాది నవంబర్ 23 బెంగాల్ గవర్నర్గా నియమితులయ్యారు. అంతకు మందు ఆయన వెస్ట్ బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై నియమించి విచారణ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. అయితే ఆయనపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ వర్గాలు నివేదిక ఇవ్వడంతో కేంద్ర హోం శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది.