పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ సరైన సమయంలో ఓ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ మాత్రం ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన అనుచరులు కూడా వచ్చారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పంజాబ్ పరిస్థితులపై చర్చించడానికి పంజాబ్ కాంగ్రెస్ అగ్రనేతలు ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సిద్దూ హాజరయ్యారు. సీఎం చెన్నీ కూడా రావాల్సి ఉంది. గంట సేపు ఈ సమావేశం జరిగినా.. సీఎం చెన్నీ మాత్రం హాజరు కాలేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అయ్యింది. తమ గుర్తుపై గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా ఉండేందుకు ముందు నుంచే జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులందరితో సమావేశాలు జరుపుతోంది. అధిష్ఠానం ఏరి కోరి.. తన తరపున ఆ ఐదు రాష్ట్రాలకు ఇన్చార్జీలను కూడా పంపుతోంది. పంజాబ్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో, లేదంటే ఇతర పార్టీలు మేజిక్ ఫిగర్కి దగ్గరగా వస్తే ఏం చేయాలన్న దానికోసం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చెన్నీ రాలేదు.