భువనేశ్వర్: ఫేమస్ యూట్యూబర్ కామియా జాని(Kamiya Jani).. ఇటీవల పూరి జగన్నాథ ఆలయంపై వీడియో తీశారు. ఆ వీడియో తీసేందుకు బీజేడీ నేత పాండియన్ .. యూట్యూబర్ కామియాకు అనుమతి ఇచ్చారు. బీఫ్ తినే కామియాకు ఎలా అనుమతి ఇచ్చారని ఒడిశాకు చెందిన బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో బీజేపీ, బీజేడీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కామియాను అరెస్టు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
బీఫ్ తింటానని పలుమార్లు కామియా చెప్పింది. గతంలో వీడియోలు కూడా చేసింది. అయితే బీజేడీ నేతలు మాత్రం కామియాను డిఫెండ్ చేస్తున్నారు. గో మాంసం తీనేవాళ్లను .. హిందూ ఆలయాల్లోకి రానివ్వరు. అలాంటిప్పుడు ఆమెకు ఎలా పర్మిషన్ ఇచ్చారని బీజేపీ ప్రశ్నించింది. బీఫ్ తినేది నిజమే అయినా.. గతంలో తాను గుళ్లు, గోపురాలకు చెందిన అనేక వీడియోలను తీసినట్లు కామియా తెలిపారు.
జగన్నాథుడి ఆలయంపై కామియా జాని తీసిన ఈ వీడియోను ఓసారి వీక్షించండి..