కోల్కతా: బంగ్లాదేశ్ ఎంపీ(Bangladesh MP ) అన్వరుల్ అజిమ్ అనార్.. కోల్కతాలో అదృశ్యమయ్యారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనా పార్టీకి చెందిన ఆయన వైద్య చికిత్స నిమిత్తం మే 12వ తేదీన ఆ నగరానికి వచ్చారు. అయితే అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకుండాపోయినట్లు తెలుస్తోంది. కోల్కతా పోలీసులు ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ కోసం బుధవారం నుంచి అన్వేషిస్తున్నారు. అవామీ లీగ్ పార్టీకి చెందిన ఆయన మొబైల్ ఫోన్ కూడా ప్రస్తుతం స్విచాఫ్లో ఉన్నట్లు తెలిసింది. బహుశా ఆ ఎంపీని మర్డర్ చేసి ఉంటారని కోల్కతా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన మృతదేహాన్ని కోల్కతా న్యూటౌన్ ఏరియాలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో న్యూటౌన్ ప్రాంతంలో ఓ వ్యక్తి శరీరాన్ని గుర్తించారు. అయితే ఇప్పటి వరకు ఆ మృతదేహం ఎవరిదో గుర్తించలేదు.