న్యూఢిల్లీ: చట్ట విరుద్ధంగా అస్సాంలో ఉంటున్న బంగ్లా దేశీయులను రాత్రి వేళ బలవంతంగా వారి దేశంలోకి నెట్టేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఢాకాలోని భారత హైకమిషనర్కు సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల అస్సాం ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసదారుల అంశాన్ని బీజేపీ ఎన్నికల ప్రచారానికి బాగా వాడుకొన్నది. ఈ నేపథ్యంలో ఏబీపీ ఇంటర్వ్యూలో హిమంత మాట్లాడుతూ… ‘వాళ్లను విదేశాంగ శాఖ ద్వారా అధికారికంగా వెనక్కి పంపాలి.
ఆ జాబితాలో ఎంతమందిని తమ దేశస్తులుగుర్తించి అనుమతించాలనే విషయంలో బంగ్లాదేశ్కే అధికారం ఉంటుంది. అందుకే ఈ మధ్య అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను రాత్రి వేళ బంగ్లాదేశ్ సరిహద్దు దళం లేని చోట వారి దేశంలోకి తోసేస్తున్నాం’ అని అన్నారు. నిరుడు సుప్రీం కోర్ట్ అక్రమ వలసదారుల తరలింపు విషయంలో జిల్లా మెజిస్ట్రేట్లకు పూర్తి అధికారాలు ఇచ్చిందని.. ఒక వ్యక్తి భారతీయుడు కాదని వాళ్లు భావిస్తే తరలించ వచ్చని తెలిపిందని హిమంత తెలిపారు.