న్యూఢిల్లీ : తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండా ప్రకాశ్ తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు బండా ప్రకాశ్ అందజేశారు. బండా ప్రకాశ్ వెంట ఎంపీలు కే కేశవరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, సురేశ్ రెడ్డి, లింగయ్య యాదవ్ ఉన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండా ప్రకాశ్ తెలంగాణ శాసనమండలికి ఎన్నికైన విషయం విదితమే.