బెంగళూర్ : నిన్న మొన్నటి వరకూ టమాట మంటమడిస్తే ఉల్లి ధరతోనే ఘాటెక్కించింది. వీటి ధరలు కొంత దిగివస్తున్నాయనుకుంటే సామాన్యుడి పండుగా పేరొందిన అరటి పండ్ల (Banana Prices) ధరలు ఖరీదవనున్నాయి. బెంగళూర్ సహా దేశవ్యాప్తంగా కిలో అరటి అటూఇటుగా రూ. 100కి చేరగా వినాయక చవితి, దసరా, ఓనం సహా రాబోయే నెలల్లో వివిధ పండగల సందర్భంగా ధరలు ఆకాశాన్ని అంటుతాయని చెబుతున్నారు.
అరటి సరఫరాలు తగ్గుముఖం పట్టడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతుండగా దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు పెంచారని, తమకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. పండుగల సీజన్ ముంచుకొస్తుండగా డిమాండ్కు అనుగుణంగా పండ్ల దిగుబడి మార్కెట్కు చేరడం లేదని, దీంతో రాబోయే రోజుల్లో అరటి పండ్ల ధరలు మరింత ఎగబాకుతాయని రిటైల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.
డిమాండ్ అధికంగా ఉండటంతో ఉదయాన్నే తమ సరుకంతా అమ్ముడవుతోందని, గతంలో రోజుకు ఆరు టన్నులే అమ్ముతున్న తాము ఇప్పుడు ఏకంగా రోజుకు 12 టన్నులు అమ్ముతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. రైతులు మాత్రం తాము పడిన కష్టానికి తగిన ప్రతిఫలం హోల్సేల్ మార్కెట్లలో లభించడం లేదని దళారులే బాగుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :