లక్నో: పోస్ట్మార్టం గదిలో ఉన్న ఒక కర్రల నిచ్చెన దానికదే నడిచింది. మనుషులు నడుస్తున్న మాదిరిగా అడుగులు వేసింది. కొంత దూరం నడిచి వెళ్లింది. (Ladder Walks). ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఆర్ఎంఎస్ మెడికల్ కాలేజీ పోస్ట్మార్టం గదిలో వెదురు కర్రలతో తయారు చేసిన ఒక నిచ్చెన ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ నిచ్చెన నడుస్తూ ముందుకు కదిలింది. నిచ్చెనకు ఉన్న నాలుగు కర్రలు మనుషుల మాదిరిగా అడుగులు వేస్తూ నడిచాయి.
కాగా, ఒక వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ను అరవింద్ ఛోటియా అనే వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేశాడు. బరేలీలోని ఎస్ఆర్ఎంఎస్ మెడికల్ కాలేజ్లోని పోస్ట్మార్టం రూమ్లో కర్రల నిచ్చెన నడిచిందని పేర్కొన్నాడు. గుండె ధైర్యం లేని వ్యక్తులు ఈ వీడియో క్లిప్ను చూడవద్దని ఆ పోస్ట్లో హెచ్చరించాడు.
మరోవైపు భయం కలిగించేలా ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సుమారు ఏడు లక్షల మంది ఈ వీడియో క్లిప్ను వీక్షించారు. ఎనిమిది వేల మంది లైక్ చేశారు. కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. దెయ్యాలు, లేదా ఆత్మలు ఆ నిచ్చెనను నడిపించినట్లు మరికొందరు అనుమానించారు. గ్రాఫిక్ మాయాజాలమని కొందరు కామెంట్ చేశారు.
కాగా, అతీంద్రియ శక్తుల ప్రమేయాన్ని కొందరు ఖండించారు. నాలుగు కాళ్లున్న కర్ర నిచ్చెన ఇలా నడవటం వెనుక శాస్త్రీయ కారణం ఉందన్నారు. న్యూటన్ జడత్వ నియమం వల్ల ఇలా జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అడ్డుకునే బాహ్య శక్తి లేనప్పుడు చలనంలో ఉన్న వస్తువు వాలుగా ఉన్న ఉపరితలంపై కొంత దూరం కదులుతుందని పేర్కొన్నారు. దీనిని ‘పాసివ్ డైనమిక్ వాక్’గా వ్యవహరిస్తారని వివరించారు.
कमजोर दिल वाले दूर रहें…
बरेली (उत्तर प्रदेश) के SRMS मेडिकल कॉलेज के पोस्टमार्टम हाउस में अपने चारों टांगों से सीढ़ी चलने का वीडियो वायरल हो रहा है। pic.twitter.com/Up9BHq4ChB— Arvind Chotia (@arvindchotia) August 29, 2023