క్వెట్టా: మానవ హక్కుల సంస్థ ‘బలోచ్ యక్జెహ్తీ కమిటీ(బీవైసీ) తమ కేంద్ర నాయకురాలు మహరంగ్ బలోచ్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతికి రెండోసారి నామినేట్ అయినట్లు ప్రకటించింది. ఫ్రంటియర్ కోర్స్ అధికారి హత్య కేసులో మహరంగ్ బలోచ్తో సహా నలుగురు కార్యక్తరలకు పాక్ న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది.
ఈ తీర్పుపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడటం విశేషం. కాగా ఈ నామినేషన్ ప్రక్రియ 2026 జనవరిలోనే జరిగిందని బీవైసీ ఒక ప్రకటనలో పేర్కొంది. బలూచిస్థాన్లో మానవ హక్కుల పరిస్థితిపై ప్రపంచ దేశాలు జోక్యం చేసుకొనేందుకు ఈ నామినేషన్ ప్రోత్సాహం ఇస్తుందని బీవైసీ తెలిపింది.