న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరిచింది. పీఎంఎల్ఏ కింద నమోదు అయిన మనీల్యాండరింగ్ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇవ్వడం రూల్ అని, జైలుశిక్ష విధించడం మినహాయింపు అని, మనీల్యాండరింగ్ కేసులకు ఇది వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు చెందిన మనీ ల్యాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రేమ్ ప్రకాశ్ అనే వ్యక్తి బెయిల్ పిటీషన్పై విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. వ్యక్తులకు విముక్తి కల్పించడమే రూల్ అని, చట్ట ప్రకారం ఆ చర్యను చేపట్టడమే జైలుశిక్ష నుంచి మినహాయింపుగా ధర్మాసనం తెలిపింది. పీఎంఎల్ఏ కేసులో నిందితుడు దర్యాప్తు సమయంలో వెల్లడించే అంశాలను ఆధారాలుగా తీసుకోలేమని కోర్టు చెప్పింది. ఎవిడెన్స్ యాక్టులోని సెక్షన్ 25 వర్తిస్తుందా లేదా అన్న అంశాన్ని ఒక్కొక్కటిగా పరిశీలించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. ప్రకాశ్కు బెయిల్ ఇచ్చిన కోర్టు.. 5 లక్షల పూచీకత్తుపై రిలీజ్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.