రాయ్పూర్ : మతం పేరుతో కాషాయ పార్టీ ఓట్ల వేట సాగిస్తోందని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ ఆరోపించారు. ఓట్ల కోసమే బీజేపీ రామజన్మభూమి-బాబ్రీమసీదు అంశాన్ని లేవనెత్తిందని అన్నారు. స్వాతంత్రోద్యమానికి పూర్వమే అయోధ్య కేసు ఉందని, ఈ వ్యవహారంలో ఏమీ చేయని బీజేపీ ఆపై ఓట్ల కోసం ఈ అంశాన్ని తలకెత్తుకుందని అన్నారు.
చత్తీస్ఘఢ్లో 15 ఏండ్లు అధికారంలో ఉన్నప్పటికీ కాషాయ పార్టీ రామ్ వన్ గమన్ పధ్ను ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. కాగా సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రక తీర్పు వెలువరిస్తూ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.
వివాదాస్పద స్ధలంలో మందిర నిర్మాణానికి అనుకూలంగా సర్వోన్నత న్యాయస్ధానం తీర్పు వెలువరించింది. చారిత్రక తీర్పు వెల్లడించే ముందు అప్పటి భారత ప్రదాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం 40 రోజుల పాటు నిరంతరాయ విచారణను చేపట్టింది.