న్యూఢిల్లీ, జూలై 5 : బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు ‘బద్రీనాథ్-కేదార్నాథ్’ ఆలయ కమిటీ (బీకేటీసీ) ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటుచేసింది. సీసీ టీవీ ఫుటేజ్, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలపై ఈ ప్యానెల్ సమగ్ర విచారణ చేయనున్నది. బద్రీనాథ్ ధామ్కు సంబంధించి సోషల్మీడియాలో వస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్నట్టు బీకేటీసీ తెలిపింది.
నిష్పక్షపాత విచారణ జరిగేలా బీకేటీసీ చైర్మన్ హేమంత్ ద్వివేదీ ఈ ప్యానెల్ను ఏర్పాటుచేశారని, అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిశీలించాలని ప్యానెల్ను ఆయన కోరారని బీకేటీసీ సీఈవో సోహన్సింగ్ చెప్పారు. అయోధ్య రామమందిరం కానుకల విషయంలో ఆరోపణలు వెలువడిన కొద్ది రోజులకే ‘బద్రీనాథ్’ ఆలయం నిర్వహణపైనా ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వివాదం ఉత్తరాఖండ్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది.