బద్రీనాథ్ : శీతాకాలం సందర్భంగా అత్యంత పవిత్రమైన బద్రీనాథ్ దేవాలయాన్ని శనివారం నుంచి మూసివేశారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని 15 క్వింటాళ్ల బంతి పూలతో అందంగా అలంకరించారు. ఈ అలంకరణను చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన భక్తులు అత్యంత భక్తి, శ్రద్ధలతో బదరీనాథునికి పూజలు చేశారు.
తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు క్యూలలో నిల్చుని బదరీనాథుని దర్శనం చేసుకున్నారు.