కోల్కతా: వివాదాస్పద బాబ్రీ మసీదు నిర్మాణం పశ్చిమ బెంగాల్లో బుధవారం ప్రారంభమైంది. ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాలో బుధవారం మధ్యాహ్నం ఖురాన్ పఠనం అనంతరం నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభించినట్టు జనతా ఉన్నాయన్ పార్టీ అధ్యక్షుడు హుమాయున్ కబీర్ తెలిపారు.
ఈ శంకుస్థాపన సందర్భంగా జరిగిన ఖురాన్ పఠన కార్యక్రమంలో 1,200 మంది పాల్గొనగా, నిర్మాణ పనుల్లో 5 వేల మంది భాగస్వాములయ్యారు.