లక్నో, అక్టోబర్ 27: విద్వేష ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజంఖాన్కు మూడేండ్ల జైలు శిక్షపడింది. ఈ మేరకు రాంపూర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. రూ.25వేల జరిమానా కూడా విధించింది. హయ్యర్ కోర్టులో అప్పీల్ చేసేందుకుగానూ బెయిల్ మంజూరు చేసింది. 2019 ఏప్రిల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసినందుకుగానూ ఆజంఖాన్పై రాంపూర్లో కేసు నమోదైంది.