న్యూఢిల్లీ: అయోధ్య మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో దేశమంతా రామభక్తిలో మునిగితేలుతున్నది. గుజరాత్లోని సూరత్కు చెందిన ఓ కళాకారుడు 9,999 వజ్రాలతో అయోధ్య రామ మందిరాన్ని రూపొందించాడు. నల్లని అట్టపై సన్నని వజ్రాలను అతికించి అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ మందిరం చూపరులను కండ్లు తిప్పుకోనివ్వడం లేదు. ఆలయంపైన ఎడమవైపున ‘జైశ్రీరాం’ అని రాయగా, కుడివైపున విల్లంబులు ధరించిన రామయ్య నడిచివస్తున్నట్టుగా చిత్రీకరించాడు.