Ayodhya: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అయోధ్యకు సంబంధించి ఎన్నో విశేషాలు జరుగుతున్నాయి.
తాజాగా గుజరాత్లోని భావ్నగర్కు చెందిన జైలంగానియా అనే ఆభరణాల వ్యాపారి వెండి ఉంగరంపై అయోధ్య రామాలయ నమూనాను తీర్చిదిద్దారు. 22 రోజుల వ్యవధిలో 24 గ్రాముల వెండిని ఉపయోగించి డిజిటల్గా తయారుచేశారు. ఈ ఉంగరం ధర మార్కెట్లో రూ.8,600 ఉంది.
కొద్దిగా బంగారం కూడా కలిపిన ఈ ఉంగరంలో హనుమాన్ విగ్రహం, రామ్దర్బార్ ఉన్నాయి. జైలంగానియా ఇప్పటివరకు 130 దేవాలయాల బొమ్మలతో ఆభరణాలను రూపాందించారు.