న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి మాస్క్ ధరించడం, సామాజికదూరం పాటించడమే శ్రీరామ రక్ష. ఈ తారకమంత్రాన్ని పాటించి భారత్లో పది కుటుంబాల్లో ఎనిమిది తమను తాము రక్షించుకున్నాయి. ఈ కీలక విషయాలు లోకల్ సర్కిల్స్ సర్వే ద్వారా వెలుగులోకి వచ్చింది. సర్వేలో దేశవ్యాప్తంగా 345 జిల్లాలకు చెందిన 29వేల మంది సర్వేలో పాల్గొన్నారు. గత గడిచిన రెండేళ్లలో 57శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది వైరస్ బారినపడ్డారని లోకల్ సర్కిల్స్ పేర్కొంది.
పలు రాష్ట్రాలు కరోనా మహమ్మారికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేసిన సమయంలో ఈ సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం.. అలాంటి కుటుంబాల్లో ఎనిమిది గత రెండేళ్లలో కరోనా మహమ్మారి బారినపడలేదని తేలింది. ఇందులో మాస్క్లు ధరించడంతో పాటు సామాజిక దూరం నిబంధనలు కీలక పాత్ర పోషించాయి. అయితే, ఇప్పటి వరకు కరోనా సోకని వారి నుంచి వచ్చిన ప్రతి స్పందనలను విశ్లేషించగా.. 80శాతం మంది కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రద్దీ ప్రాంతంలో తిరగడాన్ని తగ్గించడంతో పాటు మాస్క్లు ధరించడం, సామాజిక దూరం తదితర నిబంధనలు ఖచ్చితంగా పాటించారు. 33 శాతం మంది ఇతర వ్యక్తులను కలువాల్సిన పరిస్థితి వస్తే.. ఇంటి నుంచి బయటకు వచ్చి మాత్రమే కలిసినట్లు చెప్పారు.
అంతే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో కలువాల్సిన పరిస్థితి వస్తే ఇంట్లోకి గాలి వచ్చేలా చూసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 61శాతం మంది పురుషులు, 39శాతం మంది మహిళలు ఉన్నారు. ఒకరు, లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కరోనా సోకిన వారిలో 74శాతం కుటుంబాలు సామాజిక బంధాలు తగ్గించడం ద్వారా, మాస్క్లు ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని చెప్పారు. అయితే, కరోనా మహమ్మారి అన్ని వేవ్ల్లోనూ మాస్క్, సామాజిక దూరం పాటించడం ప్రభావవంతంగా ఉందని సర్వే పేర్కొంది.