న్యూఢిల్లీ: దేశంలో మధ్యతరగతి తలసరి ఆదాయం పెరుగుతున్నది. 2011-22 ఆర్థిక సంవత్సరాల మధ్య దాఖలైన ఇన్కమ్ టాక్స్ రిటర్న్ల ఆధారంగా ఎస్బీఐ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అదే సమయంలో సున్నా ఆదాయపు పన్ను కేటగిరి సంఖ్య తగ్గుముఖం పట్టింది. అత్యల్ప ఆదాయ కేటగిరి నుంచి తప్పుకున్న వారి సంఖ్య పెరగడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
2022లో 73 మిలియన్ల మంది రిటర్న్లు ఇవ్వగా 2023లో ఈ సంఖ్య 78 మిలియన్లకు చేరింది. 2023లో రూ.2 లక్షలు ఉన్న సగటు ఆదాయం 2047 నాటికి రూ.14.9 లక్షలకు చేరుకుంటుందని ఎస్బీఐ అంచనా వేసింది. 2012-23 మధ్య రిటర్న్లు దాఖలు చేసే వారి సంఖ్య 13.6 శాతం నుంచి 2047 నాటికి 25 శాతానికి పెరుగుతుందని పేర్కొంది.