అహ్మదాబాద్: ప్రియుడ్ని పెళ్లి చేసుకునేందుకు ఒక మహిళ కూల్ డ్రింక్లో విషం కలిపింది. అది తాగిన భర్తతోపాటు అతడి స్నేహితుడు మరణించారు. దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు. గుజరాత్లోని జునాగఢ్లో ఈ సంఘటన జరిగింది. ఆటో నడిపే రఫీక్ ఘోగ్రీ, అతడి స్నేహితుడు భరత్ అలియాస్ జాన్ ఇటీవల అనుమానాస్పదంగా మరణించారు. వారు కల్తీ మద్యం సేవించి చనిపోయినట్లు పోలీసులు అనుమానించారు. అయితే వారిద్దరూ విషం సేవించి మరణించినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. దీంతో వారు తాగిన కూల్ డ్రింక్పై దర్యాప్తు చేయగా అసలు సంగతి తెలిసింది.
రఫీక్ ఘోగ్రీ భార్య మెహమూదా, అతడి స్నేహితుడైన ఆసిఫ్ చౌహాన్ మధ్య ఎనిమిది నెలలుగా వివాహేతర సంబంధం ఉంది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. తమకు అడ్డుగా ఉన్న రఫీక్ను చంపాలని ప్లాన్ వేశారు. ఆసిఫ్ స్నేహితుడు ఇమ్రాన్ ద్వారా సైనైడ్ సమకూర్చుకున్నారు. కూల్ డ్రింక్లో దానిని కలిపి రఫీక్ నడిపే ఆటోలో ఉంచారు.
కాగా, సైనైడ్ కలిపిన కూల్ డ్రింక్ తాగిన రఫీక్ అచేతనంగా పడిపోయాడు. ఆ తర్వాత అతడి స్నేహితుడు భరత్ కూడా ఆ కూల్ డ్రింక్ తాగి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ వారిద్దరూ చనిపోయారు. దీంతో కల్తీ మద్యం సేవించి చనిపోయినట్లు పోలీసులు అనుమానించారు. అయితే వారు తాగిన కూల్ డ్రింక్లో విషం కలిపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో రఫీక్ భార్య, ఆమె ప్రియుడు ఆసిఫ్తోపాటు హత్యకు సహకరించిన ఇమ్రాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.