లఢక్లోని పర్వత ప్రాంతంలో అద్భుతం ఆవిష్కృతమైంది. అరుదుగా కనిపించే అరోరాను సరస్వతి పర్వత శ్రేణుల్లోని ఖగోళ అబ్జర్వేటరీ కెమెరా బంధించింది. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుంది.
సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి. సాధారణంగా ఇవి అలస్కా, నార్వే తదితర విదేశాల్లోని పర్వత ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారత్లో అరోరా ఏర్పడటం ఇదే మొదటిసారి.