ముంబై, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ రైల్వేస్టేషన్గా మార్చింది. అదే విధంగా ఇస్లాంపూర్ పేరును ఈశ్వర్పూర్గా మారుస్తూ ఆదేశాలు జారీచేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడి గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔరంగాబాద్ నగరం, రైల్వేస్టేషన్కు గతంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ను 1900లో నిర్మించారు. ఏడవ నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ దీనిని ప్రారంభించారు.