బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు లింగాయత్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఏడాదిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కాషాయ పార్టీపై వ్యతిరేకత ఆసరాగా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
లింగాయత్ల ఓట్ల కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేలా రాహుల్ గురువారం సిద్ధగంగ మఠ్ చేరుకున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధగంగ మఠాన్ని సందర్శించనున్న నేపధ్యంలో రాహుల్ అంతకుముందుగా ఇక్కడకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
లింగాయత్ల జనాభా అధికంగా ఉండటంతో కర్నాటక రాజకీయాల్లో ఈ వర్గాన్ని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాషాయ పార్టీ సంక్షేమ పధకాలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.