భోపాల్, జూలై 1: నిషేధిత బీఫ్ (ఆవు మాంసం) తీసుకెళ్తున్నారనే అనుమానంతో ఇద్దరు ముస్లింలపై దాడి జరిగిన ఘటన మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో జరిగింది. సిహదాకు చెందిన ఇద్దరు ముస్లింలు బక్రీద్ సందర్భంగా బీఫ్ తీసుకెళ్తున్నారని బజరంగ్దళ్ కార్యకర్తలకు సమాచారం అందింది. దీంతో కార్యకర్తలు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకున్నారు. తాము మటన్ తీసుకెళ్తున్నామని బజరంగ్దళ్ కార్యకర్తలకు బాధితులు చెప్పారు. ఈ విషయంలో వాగ్వాదం జరగడంతో వారిపై బజరంగ్దళ్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.