Indelible Ink | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): పోలింగ్ సమయంలో ఓటరు వేలిపై ప్రత్యేకమైన బ్లూ ఇంక్ను మార్క్గా వేస్తారు. రిగ్గింగ్ జరుగకుండా ఇదో ఏర్పాటు. ఇలా వేసిన ఇంక్ కొన్నిరోజులపాటు అలాగే ఉంటుంది. అయితే, ఈ ప్రత్యేక ఇంక్ను కర్ణాటకలోని మైసూరులో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నీష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్) కంపెనీలో మాత్రమే తయారుచేస్తారు. దీని తయారీ ఫార్ములా కూడా రహస్యమే.
ఎంపీవీఎల్ డైరెక్టర్లకు కూడా ఈ ప్రత్యేక ఇంక్ తయారీ ఫార్ములా తెలియదు. ఎంపీవీఎల్ సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్లకు మాత్రమే ఇంక్ తయారీ విధానం గురించి తెలుసు. రిటైర్మెంట్ లేదా అనుకోని కారణాలు ఏర్పడితే, నమ్మకస్తులైన తమ తర్వాతి ఉద్యోగులకు ఈ ఫార్ములాను సదరు కెమిస్ట్లు బదిలీ చేస్తారట. కాగా, వచ్చే లోక్సభ ఎన్నికల కోసం రూ. 55 కోట్ల విలువైన 26.55 లక్షల ఇంక్ వయల్స్ను వాడనున్నారు. ఈ మేరకు ఎంపీవీఎల్కు ఎన్నికల సంఘం తయారీ బాధ్యతలను అప్పగించింది.