MK Stalin Biography | తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బయోగ్రఫీ పుస్తకావిష్కరణ సభకు పలువురు ప్రముఖ రాజకీయ నేతలు గైర్హాజరయ్యారు. ఈ వేడుక ప్రధానంగా బీజేపీ వ్యతిరేక పార్టీల నేతల కలయికకు వేదిక అవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరు కాలేదు. వీరంతా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అస్త్రశస్త్రాలు సంసిద్ధం చేసుకున్నారు. దీనిపై డీఎంకే రియాక్టయింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్థానిక ఎన్నికల్లో బిజీగా ఉన్నారని, మిగతా వారు కూడా ఫ్రీ గా లేరని చెప్పుకొచ్చింది. కానీ తమ అధినేత స్టాలిన్ పుస్తకావిష్కరణ తేదీ మార్చుకోలేమని వివరణ ఇచ్చింది.
స్థానిక ఎన్నికల ప్రచారంలో మమతా మేడం బిజీగా ఉన్నారు. ఇతరులు కూడా ఖాళీగా లేరు. స్టాలిన్ జన్మ దినోత్సవం మంగళవారం కావడంతో ముందు రోజు పుస్తకావిష్కరణ ఖరారు చేశామని అన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి.
ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. స్టాలిన్ బయోగ్రఫీ పుస్తకావిష్కరించారు. కార్యక్రమంలో కేరళ సీఎం పినరాయి విజయన్, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.