న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: దక్షిణ గాజా నగరం రఫాలో శనివారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 44మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతు ల్లో డజన్కు పైగా చిన్నారులున్నారు. రఫా పట్టణంపై దాడికి ఇజ్రాయిల్ సిద్ధమైందని, అక్కడ కిక్కిరిసిన జనాభాను బయటకు పంపించేందుకు ప్రణాళికను తయారు చేయాలని తాను సైన్యాన్ని అప్రమత్తం చేసినట్టు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు శుక్రవారమే తెలిపారు.
చాలా మంది ఇజ్రాయిల్ ఆదేశాలను పాటించినప్పటికీ మూడింట రెండొంతుల మంది రఫాలోనే ఉండిపోయారు. పాలస్తీనియన్లను వారి భూమి నుంచి వెళ్లగొట్టడమే ఇజ్రాయిల్ లక్ష్యంగా పెట్టుకున్నదని ఈజిప్టు విదేశాంగ మంత్రి సమేష్ షౌక్రి తెలిపారు.