Assembly Election Results 2023: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఉత్తరాదిన మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిక్యంలో దూసుకుపోతోంది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ ముందంజలో ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి వెలువడ్డ ఫలితాల ప్రకారం.. 230 అసెంబ్లీ స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్లో బీజేపీ 160 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 69 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లో 199 స్థానాలకు ఎన్నికలు జరుగగా బీజేపీ 114 స్థానాలలో ఆధిక్యం దక్కించుకోగా కాంగ్రెస్ 71 స్థానాలలో ముందంజలో ఉంది. 90 స్థానాలు కలిగిన ఛత్తీస్గఢ్లో 53 స్థానాలలో ముందంజలో ఉండగా కాంగ్రెస్ 35 సీట్లలో ఆధిక్యంలో ఉంది.