గువాహతి: ఉద్యోగం సాకుతో మహిళను మభ్యపెట్టి కారులోకి ఎక్కించి తొమ్మిది మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అస్సాంలోని హజో పట్టణం సమీపంలో ఈ దారుణం (Assam Shocker ) జరిగింది. బక్సా ప్రాంతానికి చెందిన అల్తాఫ్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక మహిళను అతడు నమ్మించాడు. ఉద్యోగం సాకుతో మభ్యపెట్టి ఆమెను కారులో తపబారి చార్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కారులో ఉన్న ఆ మహిళపై తొమ్మిది మంది సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధిత మహిళ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
కాగా, ఈ ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించినట్లు కమ్రూప్ జిల్లా ఎస్పీ హితేష్ చంద్ర రాయ్ తెలిపారు. ప్రధాన నిందితుడైన క్యాబ్ డ్రైవర్ అల్తాఫ్ను గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతడి అనుచరులైన ఎనిమిదిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు బాధితురాలు ధేమాజీ జిల్లాలోని ఒక గ్రామానికి చెందటంతో ఈ విషయం తెలిసిన ఆ గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు.
Also Read: