ఇంఫాల్: ఒక జవాన్ సహోద్యోగులపై గన్తో కాల్పులు జరిపాడు. (jawan fires at colleagues ) ఆ తర్వాత తనను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆరుగులు జవాన్లు గాయపడ్డారు. మణిపూర్లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం రాత్రి వేళ సాజిక్ తంపాక్ ప్రాంతంలో అస్సాం రైఫిల్స్కు చెందిన జవాన్ తన సహోద్యోగులపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకోవడంతో ఆ జవాన్ మరణించాడు. కాల్పుల్లో గాయపడిన ఆరుగురు జవాన్లను మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మణిపూర్ పోలుసులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
కాగా, గాయపడిన అస్సాం రైఫిల్స్ జవాన్లలో రాష్ట్రానికి చెందిన వారు ఎవరూ లేరని మణిపూర్ పోలీసులు తెలిపారు. మణిపూర్లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న అల్లర్లకు ఈ కాల్పులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ సంఘటనపై ఊహాగానాలు, వదంతులు ప్రచారం చేయవద్దని ప్రజలను కోరారు. అస్సాం రైఫిల్స్ జవాన్ తన సహోద్యోగులపై కాల్పులు జరిపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మణిపూర్ పోలీసులు వెల్లడించారు.
From PRO of IG AR (s):
There has been an incident of firing by an Assam Rifles Jawan in an ASSAM RIFLES BATTALION deployed close to the Indo – Myanmar border in South Manipur.
One Assam Rifles Jawan opened fire on his colleagues injuring six of them (all injured are…
— Manipur Police (@manipur_police) January 24, 2024