కోక్రాఝార్, ఏప్రిల్ 21: గుజరాత్ ఎమ్మె ల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీపై వివాదాస్పద ట్వీట్ చేశారంటూ అస్సాంలో దాఖలైన కేసులో బుధవారం రాత్రి 11.30 గంటలకు పాలంపూర్లో అదుపులోకి తీసుకొని అస్సాం తరలించారు.
అస్సాంకు చెంది న ఓ బీజేపీ నేత ఫిర్యాదుతో మెవానీపై కేసు నమోదైంది. ఈ కేసులో స్థానిక కోర్టు ఆయనకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీచేసిం ది. ప్రముఖ దళిత నేతగా పేరున్న జిగ్నేశ్, గుజరాత్లోని వద్గాం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల ఆయన కాంగ్రెస్కు మద్దతు ప్రకటించారు. గాంధీజీని హత్య చేసిన గాడ్సేని మోదీ దేవుడిలా భావిస్తున్నారని జిగ్నేశ్ గతంలో ట్వీట్ చేశారు.