ASSAM | గువాహటి: బహుభార్యత్వంపై నిషేధం విధించనున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గురువారం వెల్లడించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న వేళ.. అస్సాం ప్రభుత్వ తాజా నిర్ణయం తీవ్ర చర్చనీయాంశం అయింది.
బహుభార్యత్వంపై నిషేధం అమలు చేయడంలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులపై అధ్యయనం చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉన్నది. ‘సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెడతాం. అప్పటికి సాధ్యపడకపోతే జనవరిలో జరిగే సమావేశాల్లో బిల్లును తీసుకువస్తాం’ అని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు.