గువహటి : అసోంలోని చిరాంగ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ ఇద్దరు పోలీసులు ట్రాఫిక్ రూల్స్ను పాటించలేదు. హెల్మెట్ ధరించకుండా బైక్పై వెళ్తున్నారు. మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా? అని ఓ జర్నలిస్టు ఆ పోలీసులను ప్రశ్నించాడు. దీంతో పోలీసులు సదరు జర్నలిస్టుపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. మరికొంత మంది పోలీసులను పిలిపించి.. జర్నలిస్టును బలవంతంగా జీపులో ఎక్కించారు. బాధిత జర్నలిస్టును జయంత్ దేబ్నాథ్గా గుర్తించారు.
ఇద్దరు పోలీసులు హెల్మెట్ ధరించకుండా బైక్పై వెళ్తుండగా.. ప్రజలకు మీరిచ్చే సందేశం ఇదేనా? అని ప్రశ్నించడమే తప్పైందని జర్నలిస్టు వాపోయాడు. పోలీసులు అసభ్యకరమైన పదజాలంతో దూషించి, దాడి చేశారని జయంత్ తెలిపాడు. తాను జర్నలిస్టునని చెప్పే సరికి పోలీసులు మరింత రెచ్చిపోయారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం ఇద్దరు పోలీసులపై తగు చర్యలు తీసుకుంటామని చిరాంగ్ డీఎస్పీ స్పష్టం చేశారు.