న్యూఢిల్లీ, నవంబర్ 4: అస్సాంలోని మియా ముస్లింల (బెంగాల్కు చెందిన ముస్లింలు) నుంచి తాము ఓట్లు ఆశించడం లేదని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ చెప్పారు. అందుకే వాళ్లు ఎక్కువగా ఉన్న మెడికల్ కాలేజీలను సందర్శించడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింల అభివృద్ధిపైనే తమ దృష్టి ఉంటుందని, వలస వచ్చిన మియా ముస్లింలపై కాదని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ మౌలానా బద్రొద్దీన్ అజ్మల్ స్పందిస్తూ మియా ముస్లింలు గువాహటిలో మూడు రోజులపాటు పనిచేయకపోతే ఈ ప్రాంతం శ్మశాన వాటికగా మారుతుందని వ్యాఖ్యానించారు.