Himanta Biswa Sarma | గువాహటి, అక్టోబర్ 2: బెంగాలీ మాట్లాడే ‘మియా’ ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. కుటుంబ నియంత్రణ పాటించాలని, బాల్య వివాహాల వంటి పద్ధతులను పక్కనపెట్టి, తమను తాము సంస్కరించుకొనేంత వరకు వచ్చే పదేండ్ల పాటు ‘చార్(నదీ తీరం)’ ప్రాంత మియా ప్రజల ఓట్లు తమకు అక్కర్లేదని ఆదివారం వ్యాఖ్యానించారు.
అయితే మియా ప్రజలు తనకు, ప్రధాని మోదీకి, బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, వారు ఓటు వేయకుండా కమలం పార్టీకి అనుకూలంగా తమ మద్దతు కొనసాగించవచ్చునని చెప్పుకొచ్చారు.