న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. సీఎం అశోక్ గెహ్లాట్కు సమన్ల జారీకి సంబంధించి రిజర్వ్ చేసిన తీర్పును గురువారం వెల్లడించారు.
కాగా, రాజస్థాన్లోని సంజీవని క్రెడిట్ సొసైటీకి సంబంధించిన రూ.900 కోట్ల స్కామ్లో కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు సంబంధం ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ గతంలో ఆరోపించారు. ఈ ఏడాది ఏప్రిల్లో దీనిపై ఆయన ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అశోక్ గెహ్లాట్పై పరువునష్టం దావా వేశారు. ఆ స్కామ్పై రాజస్థాన్ ప్రభుత్వం చేసిన దర్యాప్తులో తన పేరు బయటకు రాలేదన్నారు. అయినప్పటికీ అశోక్ గెహ్లాట్ తప్పుడు ఆరోణలు చేసి తన పరువునకు నష్టం కలిగించినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతిష్టను కోల్పోయినందుకు ఆర్థిక పరిహారాన్ని డిమాండ్ చేశారు.
మరోవైపు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.